కూరలో ఉప్పు లేదని భార్యని చంపిన భర్త..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 11:37 AM

కూరలో ఉప్పు లేదని భార్యని చంపిన భర్త..

దేశంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు దుర్మార్గులు క్షణికావేశంలో సొంతవారినే కడతేరుస్తున్నారు. ఓ భర్త కూరలో ఉప్పు తక్కువైందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని సారన్‌ జిల్లాలో వెలుగుచూసింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్య (50) పై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన సరన్ జిల్లాలోని మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాన్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాంఝీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హంతకుడైన భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం భార్య శుక్రవారం రాత్రి వంట చేసింది. పొరపాటున కూరలో ఉప్పు కొద్దిగా తక్కువగా వేడయంతో భార్యపై ప్రభురామ్ కోపంతో రగిలిపోయాడు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన ప్రభురామ్ ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు.
అయితే ప్రభురామ్ తాటిచెట్టు నుంచి కల్లు తీసి అమ్ముతాడని పోలీసులు తెలిపారు. కల్లు గీసే ఆయుధంతోనే నిందితుడు భార్యను నరికి చంపినట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.





Untitled Document
Advertisements