వీధి బాలలతో ముచ్చటించి సెల్ఫీలు తీసుకున్న కేటీఆర్

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:23 PM

వీధి బాలలతో ముచ్చటించి సెల్ఫీలు తీసుకున్న కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న-సిరిసిల్లలో బస్తీ దవాఖానను ప్రారంభించగా, ఆయన పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొంత మంది వీధి బాలలు ఆయన వద్దకు వచ్చి సెల్ఫీ కోసం అభ్యర్థించారు. మంత్రి కేటీఆర్ వారి వినతిని మన్నించి వారితో సెల్ఫీలు దిగారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగుతున్నప్పుడు నెరిసిన జుట్టుతో ఉన్న బాలుడితో మంత్రి కేటీఆర్ సరదాగా సంభాషించారు. ఆసుపత్రిలో సరైన వైద్యం చేయించుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో ఎవరు పెళ్లి చెయ్యడానికి పిల్లని ఇవ్వరు అని అన్నారు. వీరి మాటలు విని అక్కడ ఉన్నవారందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.





Untitled Document
Advertisements