ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పీఠాధిపతి సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అధికారులు అనుమతించారు. భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అందించే సరస్వతీ దేవి భక్తులకు వరాలు కురిపిస్తోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవిని శరన్నవరాత్రి పర్వదినాన మూలానక్షత్రం రోజున సరస్వతిగా, వాగ్దేవతమూర్తిగా అలంకరిస్తారు. సరస్వతీ దేవిని దర్శించుకుంటే సకల విద్యలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించరాదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఆలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు