మెగాస్టార్ చిరంజీవిని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఆయన సినిమా ‘ఆచార్య’. ఆ సినిమా వచ్చింది పోయింది కదా. మళ్లీ ఇప్పుడెందుకు ట్రోల్స్ చేయటం అనే డౌట్ రావచ్చు. అసలు విషయమేమంటే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’రిలీజ్ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన స్పందించిన తీరు ఆయనపై ట్రోలింగ్కి కారణమైంది. చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది. ‘‘కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు ఆనంద పడేవాడిని, ఫ్లాప్ వచ్చినప్పుడు బాధపడేవాడిని. అవి అప్పటి రోజులు. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. మానసికంగా, శారీరకంగా తట్టుకోవటం తెలుసుకున్నాను. ఎప్పుడైతే యాక్టర్గా ఓ పరిణితి సాధించానో అప్పుడు సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి పెద్దగా ఆలోచించటం మానేశాను. ఆచార్య విషయానికి వస్తే ఆ సినిమా ఫ్లాప్ నన్ను బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పింది చేశాం. అయితే బాధపడ్డ విషయమేమంటే నేను, చరణ్ కలిసి తొలిసారి నటించాం. ఆ సినిమా పరాజయం బాధించింది. తర్వాత మేం కలిసి నటించిన ఆ జోష్ ఉండకపోవచ్చు’’ అని అన్నారు చిరంజీవి.