తెలంగాణ కాంగ్రెస్ కు ఉహించని షాక్.. బీజేపీలోకి మరో ఐదుగురు నేతలు చేరనున్నట్టు సమాచారం..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 10:02 AM

తెలంగాణ కాంగ్రెస్ కు ఉహించని షాక్.. బీజేపీలోకి మరో ఐదుగురు నేతలు చేరనున్నట్టు సమాచారం..

తెలంగాణ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతలు బహాటంగానే టీపీసీసీ రేవంత్‌ రెడ్డిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతోంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. మరో ఐదుగురు నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారాలు వస్తున్నాయి. అయితే తెలంగాణ లో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనితో రాష్ట్రంలో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. పరిస్థితులు చూస్తుంటే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగం చేసిందనే చెప్పుకోవాలి. కాకపోతే కాషాయ పార్టీ ఈసారి రూట్ మార్చింది. మునుగోడు ఉపఎన్నిక ముందు టీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడుతూ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపింది. కాంగ్రెస్ కు క్యాన్సర్ వచ్చిందని ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకునిగా ఉన్న మర్రి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మరో ఐదుగురు నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక రేవంత్ కు టీపీసీసీ పదవి ఇవ్వడం సీనియర్లకు అస్సలు నచ్చలేదు. ఈ క్రమంలో వారు ప్రత్యామ్నాయ పార్టీని చూసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీ వైపే అసంతృప్తి నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఐదుగురు నేతలు ఇప్పటికే బీజేపీతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వారు పార్టీని వీడితే మాత్రం అది తెలంగాణ కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవాలి.





Untitled Document
Advertisements