టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్టులో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారారు. క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు ఆయనకు సంబంధించిన మరో వార్త ఎప్పుడూ డిస్కషన్స్లో ఉంటుంది. అదేంటో తెలుసా.. ప్రభాస్ పెళ్లి. నాలుగు పదులు వయసు వచ్చేసినా డార్లింగ్ పెళ్లి ఊసు ఎత్తటం లేదు. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి నెట్టింట ఎప్పుడూ ఏదో రకమైన వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇది వరకు ప్రభాస్, అనుష్క మ్యారేజ్ చేసుకుంటారనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారంటూ టాక్ అయితే బలంగానే నడుస్తుంది.
దీనికి తగ్గట్లు రీసెంట్ ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అసలు ఆమె ఎందుకలా చెప్పిందనే వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం వరుణ్ ధావన్, కృతి సనన్ కలిసి బేడియా (తెలుగులో తోడేలు) సినిమాలో నటించారు. ఆ సినిమాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్కి కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్.. ముగ్గురు హీరోలను ఆప్షన్గా ఇచ్చి వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు.. ఎ వరిని ఫ్లర్ట్ చేస్తావు అని అడిగారు. దానికి అమ్మడు కార్తీక్ ఆర్యన్ను ఫ్లర్ చేస్తానని, టైగర్ ష్రాప్తో డేట్కి వెళతానని, ప్రభాస్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ఇప్పుడు కృతి సనన్ చెప్పిన ఈ సమాధానం నెట్టింట తెగ వైర్ అవుతుంది. ఇంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ ట్రాక్ నడిచిందని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆది పురుష్ తర్వాత ప్రభాస్, కృతి సనన్ మధ్య లవ్ ఉందంటూ వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లు ఆది పురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్ కాలి ఆపరేషన్ కారణంగా నడవలేక ఇబ్బంది పడుతుంటే కృతి సనన్ చేయి పట్టుకుని నడిపించింది. తనకు చెమటలు పడుతుంటే కొంగుని అందించింది. ఇవన్నీ వీడియోల రూపంలో నెట్టింట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, కృతి సనన్ కలిసి పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.