ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొలి ఛార్జ్ షీట్ దాఖల పై కోర్టుకు తెలిపిన ఈడీ..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 05:13 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొలి ఛార్జ్ షీట్ దాఖల పై కోర్టుకు తెలిపిన ఈడీ..

ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీబీఐ దూకుడు కనబరుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ సుమారు 3 వేలకు పైగా పేజీలతో ఉన్నట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసి 60 రోజులు అవుతున్న క్రమంలో ఈడీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. కాగా ఈ కేసులో ఇదే తొలి ఛార్జ్ షీట్. ఇక మిగతా నిందితులపై కూడా త్వరలో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు ఈడీ తెలిపింది. అయితే ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అందులో ఒకరు సమీర్ మహేంద్రు కాగా శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ గా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసులో సీబీఐ ఏడుగురిపై అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో సహా మరికొందరి పేర్లు ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మిగతా వారు ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఇక మనీష్ సిసోడియా పేరును కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. అయితే ప్రస్తుతం మనీష్ సిసోడియాను విచారిస్తున్న నేపథ్యంలో సిబిఐ మనీష్ సిసోడియా పేరును చేర్చలేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి 10 వేల పేజీలతో కూడిన తొలి ఛార్జ్ షీట్ సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ ను ఈనెల 30న కోర్టు పరిశిలించనున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా పలువురు రాజకీయ వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏ1గా నరేంద్ర సింగ్, ఏ2గా కులదీప్ సింగ్, ఏ3గా విజయ్ నాయర్, ఏ4గా అభిషేక్ బోయినపల్లిని చేర్చింది సీబీఐ. ఇక తాజాగా ఈడీ కూడా తన ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడంతో కేసు కీలక దశకు చేరుకుంది.





Untitled Document
Advertisements