చేపల వాహనం బోల్తా పడటం తో చేపల కోసం పోటెత్తిన జనాలు..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 05:37 PM

చేపల వాహనం బోల్తా పడటం తో చేపల కోసం పోటెత్తిన జనాలు..

ఏలూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. జీలుగుమిల్లీ మండలం దర్భగూడెం దగ్గర చేపల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లారీ డ్రైవర్, క్లీనర్ లేకపోవడంతో ఇదే ఛాన్స్ అనుకున్నారేమో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. రోడ్డుపై దొరికిన చేపలను దొరికినట్టు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చేపలు ఎత్తుకుపోకుండా ఆపారు. చేపల లారీ కర్ణాటక నుంచి పశ్చిమ బెంగాల్ వెళుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం ఇలాంటి తరహా ఘటనే మరొకటి జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో చేపల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. దీంతో చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు, వాహనదారులు చేపల్లి కవర్లలో పోసుకుని తీసుకెళ్లారు. చేపలు రోడ్డుపై అలా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ చేపల్ని క్యాట్ ఫిష్‌లుగా గుర్తించారు. వీటిని గుట్టుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒడిశాకు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ బోల్తాపడిన వెంటనే అందులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు ఏలూరులో కూడా ఇలాంటి తరహా ఘటనే జరిగింది.





Untitled Document
Advertisements