మీడియా ముందు బావోద్వేగానికి గురైన సామ్..

     Written by : smtv Desk | Mon, Jan 09, 2023, 02:27 PM

మీడియా ముందు బావోద్వేగానికి గురైన సామ్..

'యశోద' చిత్రం తర్వత స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున మరో పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. ఈ సినిమ కాళిదాసు రచించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం నీ ఆధారంగా తీసుకుని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ విడుదల కాబోతుంది.. అయితే గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే కండాల వ్యాధితో బాధ‌ప‌డుతున్న సామ్ చాల రోజులుగా మీడియా ముందుకు రాలేదు.. ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు దీని కారణంగానే ఆమె యశోద ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు.. ఇదిలా ఉండగా చాలా రోజుల త‌ర్వాత ఆమె మీడియా ముందుకు వ‌చ్చారు. శాకుంత‌లం ట్రైల‌ర్ ఈవెంట్ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎమోష‌న‌ల్‌గా శాకుంత‌లం సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను ఎమోషనల్‌గా మాట్లాడారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారంటే..
‘‘ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంద‌ని అనుకుంటున్నాను. ఎలాగైనా ఇక్క‌డ‌కు రావాల‌ని ఫిక్స్ అయిపోయి బ‌లం తెచ్చుకుని వ‌చ్చాను. గుణ శేఖ‌ర్‌గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వ‌ల్ల వ‌చ్చాను. ఆయ‌న‌కు సినిమానే జీవితం. ప్ర‌తి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీశారు. నెరేష‌న్ విన్న‌ప్పుడూ యాక్ట‌ర్స్ అంద‌రూ సినిమా అలాగే రావాల‌ని కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్ర‌మే మా ఊహ‌ను దాటి ఎక్స్‌ట్రా మ్యాజిక్ జ‌రుగుతుంది. సినిమా చూసిన త‌ర్వాత నేను చూసిన త‌ర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఊహించిన దాని కంటే సినిమా ఎన్నో రెట్లు బావుంది. చూడ‌గానే గుణ శేఖ‌ర్‌గారి పాదాల‌పై ప‌డి థాంక్యూ చెప్పాను. దిల్ రాజుగారికి థాంక్యూ. శాకుంత‌లం అనే మ్యాజిక‌ల్ వరల్డ్‌ను క్రియేట్ చేయాలంటే ఏ లిమిట్‌, క్యాలిక్యులేష‌న్స్ లేకుండా న‌మ్మ‌కంతో చేయాలి. అలాంటి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌ని దిల్‌రాజుగారి రూపంలో చూశాను. మంచి సినిమా తీయాల‌నే ఆయ‌న చూస్తారు. ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులున్నారు. వారందరి గురించి ముందు ముందు తప్పకుండా మాట్లాడుతాను.
నేను సెట్స్‌లోకి రెడీ అయ్యి అడుగు పెట్టిన త‌ర్వాత అక్క‌డున్న అమ్మాయిల రియాక్ష‌న్ చూసి ప‌ర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడ‌ని ఫిక్స్ అయ్యాను. కాళిదాసుగారు 5వ శ‌తాబ్దంలో రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగాచేస్తోన్న శాకుంత‌లం సినిమా కోసం న‌న్ను గుణ శేఖర్‌గారు ఎంపిక చేయ‌టం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాను. అయితే మారన‌ది ఒక‌టే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను.. సినిమా న‌న్ను ఎంత ప్రేమిస్తుంద‌నే విష‌యం. శాకుంత‌లంతో ఈ ప్రేమ మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న అద్భుతమైన పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం’. స‌మంత ఇందులో శ‌కుంత‌ల‌ పాత్ర‌లో న‌టించారు. దుష్యంత మ‌హారాజు పాత్ర‌లో దేవ్ మోహ‌న్ న‌టించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యకమ్రంలో సమంత సహా గుణ శేఖర్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా మూవీగా ‘శాకుంతలం’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.





Untitled Document
Advertisements