యంగ్ హీరో అడివి శేష్ హ్యాట్రిక్ హిట్స్పై కన్నేశాడు. గత ఏడాది మేజర్, హిట్-2 సినిమాలతో వరుసగా పాన్ ఇండియా రేంజ్లో విజయాల్ని అందుకున్న అడవి శేష్.. ఈ ఏడాది ‘గూఢాచారి-2’ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మేరకు ఈ రోజు అడివి శేష్ ఫస్ట్ లుక్ని చిన్న వీడియో రూపంలో చిత్ర బృందం రిలీజ్ చేసింది.
2018లో వచ్చిన ‘గూఢాచారి’ మూవీ అడివి శేష్కి మంచి పేరు తీసుకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఆ మూవీలో అడివి శేష్కి జోడీగా శోభితా దూళిపాల నటించగా.. సుప్రియ యార్లగడ్డ, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, మధు శాలిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఊహించని ట్విస్ట్లతో అభిమానుల్ని అలరించిన ఈ మూవీకి అడివి శేష్ కథ అందించగా.. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.
గూఢాచారి మూవీతో అడివి శేష్కి రైటర్ కమ్ యాక్టర్గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది వచ్చిన ‘మేజర్’ మూవీతో ఈ యంగ్ హీరో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిపోయాడు. అలానే శైలేష్ కొలను దర్శకత్వంలో గత ఏడాది చివర్లో వచ్చిన హిట్-2 మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యి వసూళ్లని రాబట్టింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఈ రెండు సినిమాలు కూడా ఓవర్సీస్లో వసూళ్ల పరంగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరాయి. గూఢాచారి సీక్వెల్గా రాబోతున్న గూఢాచారి-2కి కూడా అడివి శేష్ కథ అందించాడు. అలానే మేజర్ సినిమాకి ఎడిటర్గా పనిచేసిన వినయ్ కుమార్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ స్టయిలిస్ లక్లో కనిపిస్తున్నాడు. గూఢాచారి-2 మూవీని అభిషేక్ అగర్వాల్, మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుంది. హిందీలో కూడా ఈమూవీ రిలీజ్ కానుంది.