మాస్ డ్యూయెట్ విడుదల 'వీరసింహారెడ్డి’టీం..

     Written by : smtv Desk | Tue, Jan 10, 2023, 11:29 AM

మాస్ డ్యూయెట్ విడుదల 'వీరసింహారెడ్డి’టీం..

బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం వీర సింహ ‘వీరసింహారెడ్డి’ ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శ్రుతి హసన్ నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు.. ఇప్పటికే మూడు పాటలు ఈ చిత్రం నుండి విడుదలయ్యాయి. ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’, ‘మా బావ మనోభావాలు’ అంటూ మూడు మూడు రకాల ట్యూన్స్‌తో సంగీత దర్శకుడు తమన్ అలరించారు. ఇదిల ఉండగా మరో పాటను విడుదల చేసారు ఇది మాంచి మాస్ డూయెట్. ‘మాసు మొగుడొచ్చాడే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. మనో, రమ్య బెహర ఆలపించారు. ఈ పాట నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి నాలుగో పాట కూడా విడుదలైంది. ‘మాసు మొగుడొచ్చాడే’ అంటూ సాగే ఈ పాట బాలయ్యను ఎలివేట్ చేయడమే కాకుండా ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ప్రస్తావన రావడం కూడా నందమూరి అభిమానులను కట్టిపడేస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.‘మాసు మొగుడొచ్చాడే’ పాటను దర్శకుడు గోపీచంద్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ ట్వీట్ కింద బాలయ్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. బాలయ్యను తమకు నచ్చే విధంగా చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘నీకు గుడికట్టడం ఒక్కటే మిగిలి ఉందన్నా’ అంటూ ఒక నందమూరి అభిమాని కామెంట్ చేశాడు. ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్ ప్రస్తావన అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ‘‘పుట్టుకతోనే మనలో ఉన్నాయి నాన్నగారి జీన్సో జీన్సు.. సేమ్ టు సేము ఆ కట్టౌటే మనకు రిఫరెన్సు’’ అనే లైన్ అభిమానులను కచ్చితంగా అలరిస్తుంది. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా.. సీనియర్ గాయకుడు మనో, రమ్య బెహర ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లిరికల్ వీడియో ఈ స్థాయిలో ఉంటే.. రేపు థియేటర్లలో ఈ పాట అభిమానుల చేత రచ్చ చేయించడం ఖాయం.
కాగా, ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా శృతి హాసన్ నటించారు. దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. చంద్రిక రవి ప్రత్యేక గీతంలో నర్తించగా.. మలయాళ నటి హనీ రోజ్ మరో కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందించారు.





Untitled Document
Advertisements