స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం కోలీవుడ్ హీరో దళపతి విజయ్ తో చేస్తున్న చిత్రం వారిసు.. ఈ సిన్మా సంక్రంత సందర్భంగా తమిళంలో జనవరి 11న రిలీజ్ అవుతుంటే తెలుగులో జనవరి 14 న రిలీజ్ అవుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై వివాదాలు నడుస్తు౦డగా ఈ ప్రెస్ మీట్ లో ఓ క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.. అయితే ఈ డిస్కషన్లో ఆయన పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టారు.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది..
తెలుగు సినిమాలకు కాకుండా వారసుడు సినిమాకు దిల్ రాజు ఎక్కువ థియేటర్స్కు కేటాయించటంపై మెగా, నందమూరి ఫ్యాన్స్ దిల్ రాజుపై ఫైర్ అయ్యారు. పలు ఇంటర్వ్యూస్లోనూ ఆయన అస్సలు వెనక్కి తగ్గేదేలే అన్నట్లు మాట్లాడారు కూడా. అయితే చివరి నిమిషంలో ఈ స్టార్ ప్రొడ్యూసర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వారసుడు సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ తమిళంలో వారిసు చిత్రాన్నిజనవరి 11నే రిలీజ్ చేస్తున్నానని కూడా అన్నారు. సినిమా కథేంటో ముందే తెలిసినపోయినప్పటికీ సినిమాపై తనకు నమ్మకం ఉందని దిల్ రాజు గట్టిగా నమ్ముతున్నారు.
ఇదే విషయాన్ని ఆయన ప్రెస్మీట్లోనూ గట్టిగా చెప్పారు. ఈ నిర్ణయం ఏదో ముందే తీసుకుని ఉండుంటే బావుండేదిగా అని ప్రశ్న వచ్చినప్పుడు ముందుగా అలాంటి నిర్ణయం తీసుకుంటే దిల్ రాజు తగ్గిపోతాడుగా అని అన్నారు. మరి ఇప్పుడు తగ్గలేదా.. అని అన్నప్పుడు ఎప్పుడు నెగ్గాలో కాదు.. ఎప్పుడు తగ్గాలో తెలియాలని పవన్ కళ్యాణ్గారు ఊరకనే అనలేదు అంటూ అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ను వాడారు రాజుగారు. దీంతో దిల్ రాజు పవన్కళ్యాణ్ను ఫాలో అవుతన్నారంటూ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
https://twitter.com/PKFC_EGodavari/status/1612322803738607617?