కశ్మీర్ లో దారుణం.. మంచు పెళ్లలు విరిగిపడి లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 11:51 AM

కశ్మీర్ లో దారుణం.. మంచు పెళ్లలు విరిగిపడి లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

సైనికుల జీవితాల్లో ప్రతి ఉదయం వారికి మరో జన్మదినమే.. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్న రీతిలో ఉంటాయి వారు నిర్వర్తిస్తున్న భాద్యతలు. దేశ సరిహద్దుల్లో సైనికులుగా వారు సేవలు అందించే క్రమంలో ఎప్పుడు ఎం జరుగుతుంది అనేది ఊహించడం కష్టం., జమ్మూ కశ్మీర్ లో విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements