నేడు ఉదయం నుంచి కూడా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగి సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్న తరుణంలో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 9 పాయింట్లు నష్టపోయి 60,105 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17,895కి పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.65%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.37%), టీసీఎస్ (1.30%), టాటా మోటార్స్ (1.21%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.46%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.89%), రిలయన్స్ (-1.27%), నెస్లే ఇండియా (-1.25%), టైటాన్ (-1.20%).