నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ లూజర్స్ వీరే

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 04:23 PM

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ లూజర్స్ వీరే

ఈ రోజు దేశీయ స్టాక్ నష్టాలనే మూటగట్టుకున్నాయి. వరుసగా మూడో రోజు నష్టాల బాట పట్టాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు వెలువడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయి 59,958కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 17,858కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%), ఎల్ అండ్ టీ (1.66%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.62%), మారుతి (1.08%), నెస్లే ఇండియా (0.74%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-2.11%), యాక్సిస్ బ్యాంక్ (-1.54%), టాటా మోటార్స్ (-1.40%), కొటక్ బ్యాంక్ (-1.26%), భారతి ఎయిర్ టెల్ (-1.12%).





Untitled Document
Advertisements