మా అమ్మని, భార్యని దగ్గరగా చూసి కీమో థెరపీ తీసుకోకూడదనుకున్నా.. సంజయ్ దత్

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 01:00 PM

మా అమ్మని, భార్యని దగ్గరగా చూసి  కీమో థెరపీ తీసుకోకూడదనుకున్నా.. సంజయ్ దత్

కేన్సర్ ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఈ వ్యాధి సోకిన వారిని తొలి దశలో గుర్తించగలిగితే సరైన చికిత్స అందించి వారిని కాపాడుకోవచ్చు అనే విషయం మనం తరుచుగా వింటుంటాం.
ఇందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యక్ష నిదర్శనం. ఏ రకంగా అంటారా? సంజయ్ దత్ కు లంగ్ కేన్సర్ ఉన్నట్టు 2020లో బయటపడింది. కీమోథెరపీ చికిత్సతో ఆయన మహమ్మారి నుంచి బయటపడ్డారు. తన అనుభవాలను ఇటీవలే ఆయన వెల్లడించారు.

‘‘నాకు వెన్ను నొప్పి వస్తుండేది. వేడి నీటి బాటిల్, నొప్పి నివారణ ఔషధాలతో చికిత్స చేశారు. కానీ, ఒక రోజు నాకు శ్వాస ఆడలేదు. వెంటనే నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో నా వెంట భార్య, సోదరి లేదా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఉన్నట్టుండి ఓ యువకుడు వచ్చి ‘మీకు కేన్సర్ ఉంది’ అని చెప్పి వెళ్లిపోయాడు. నా కండిషన్ గురించి చెప్పిన తర్వాత కీమోథెరపీ చికిత్స తీసుకోవడానికంటే చచ్చిపోవడం నయమని అనుకున్నాను.
మా కుటుంబంలో కేన్సర్ చరిత్ర ఉంది. మా అమ్మ పాంక్రియాటిక్ కేన్సర్ తో చనిపోయింది. నా భార్య (రిచా శర్మ) బ్రెయిన్ కేన్సర్ తో మరణించింది. అందుకే నాకు కేన్సర్ అని చెప్పిన వెంటనే కీమో థెరపీ తీసుకోకూడదని అనుకున్నాను. ఒకవేళ చనిపోతే చనిపోనీ కానీ, ఎలాంటి చికిత్స తీసుకోకూడదని అనుకున్నాను’’ అని సంజయ్ దత్ వెల్లడించారు.
కానీ, సంజయ్ భార్య మాన్యతాదత్, ఆయన తోబుట్టువులు ప్రియా దత్, నమ్రతా దత్ మద్దతుగా నిలవడంతో కీమో ధెరపీ తీసుకుని సంజయ్ దత్ బయటపడ్డాడు. మొత్తానికి మహమ్మారిని జయించి ఆనందంగా జీవిస్తున్నారు ప్రస్తుతం.





Untitled Document
Advertisements