వైరల్ ఫీవర్ వల్లే 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయా.. శ్రుతిహాసన్

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 02:54 PM

 వైరల్ ఫీవర్ వల్లే 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయా.. శ్రుతిహాసన్

సినిమా స్టార్స్ మరియు క్రీడాకారులు వీరంతా పబ్లిక్ ఫిగర్స్ వీరికి సంబంధించిన వార్తలు తరుచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అవి నిజం అవొచ్లేచు దా అబద్దం అయినా కావొచ్చు. కానీ వారికి సంబంధించిన వార్తలు మాత్రం తొందరగా స్ప్రెడ్ అవుతుంటాయి.తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హసన్ కి సంబంధించిన ఒ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే, తనకు మానసిక ఆరోగ్యం బాగోలేదంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ నటి, శ్రుతిహాసన్ సీరియస్ గా స్పందించింది. చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె నటించింది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగింది. తనకు అనారోగ్యంగా ఉండడంతో హాజరు కాలేకపోతున్నానంటూ ఆమె ముందే తెలియజేసింది. అనారోగ్యం అని చెప్పి ముఖ్యమైన కార్యక్రమానికి రాకపోవడంతో పలు పుకార్లకు అవకాశం లభించింది.
దీంతో మానసిక అనారోగ్యం వల్లే కార్యక్రమానికి డుమ్మా కొట్టిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ దుష్ప్రచారంపై శ్రుతిహాసన్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఘాటుగా స్పందించింది. తనకు వైరల్ ఫీవర్ ఉండడం వల్లే వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని ఆమె స్పష్టం చేసింది. తాను ఎప్పుడూ మానసికంగా ఆరోగ్యంగానే ఉంటానని స్పష్టం చేసింది. తాను ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటానని పేర్కొంది. ‘‘మీరు ఈ అభిప్రాయం నుంచి బయటకు రండి. లేదంటే థెరపిస్ట్ ను సంప్రదించండి’’ అని తన పట్ల తెలిసీ, తెలియకుండా మాట్లాడే వారికి గట్టి బదులు ఇచ్చింది.





Untitled Document
Advertisements