ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆ జీవో పై మేము జోక్యం చేసుకోలేము.. సుప్రీం కోర్టు

     Written by : smtv Desk | Fri, Jan 20, 2023, 01:45 PM

ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆ జీవో పై మేము జోక్యం చేసుకోలేము.. సుప్రీం కోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలలో చోటు చేసుకున్న అవాంచనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్1పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఏపీ సర్కార్ ఈ జీవో జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. జీవోను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్1పై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే దీనిపై విచారణ చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ ధర్మాసనం ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చతికిల పడక తప్పలేదు.





Untitled Document
Advertisements