శ్రీవిద్యకి వచ్చిన వ్యాధి గురించి ఎవరికి తెలియనివ్వలేదు.. నటి పీఆర్ వరలక్ష్మి

     Written by : smtv Desk | Wed, Jan 25, 2023, 11:29 AM

శ్రీవిద్యకి వచ్చిన  వ్యాధి గురించి ఎవరికి తెలియనివ్వలేదు.. నటి పీఆర్ వరలక్ష్మి

అలనాటి అందాల నటి శ్రీవిద్య పేరు చెప్పగానే మనకి మొదటి గుర్తోచేది ఆకాశమంత విశాలమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి.. ఆయా పాత్రలలో ఆ కళ్ళు పలికించిన హావభావాలు గుర్తొస్తాయి. అలాంటి శ్రీవిద్య గురించి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి పీఆర్ వరలక్ష్మిగారు ప్రస్తావించారు. "మనోరమ.. శ్రీవిద్యలతో నాకు మంచి స్నేహం ఉండేది. మనోరమ చెప్పిన మాటలు నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడ్డాయి" అన్నారు.

శ్రీవిద్య విషయానికొస్తే ఆమెవి ఎంతో అందమైన కళ్లు. సావిత్రి తరువాత కళ్లతోనే అద్భుతంగా నటించగల నటిగా శ్రీవిద్యను గురించి చెప్పుకోవచ్చు. కళ్లతోనే ఆమె మాట్లాడేవారు. ఆమె మంచి నటి మాత్రమే కాదు .. మంచి గాయని కూడా. నిజంగా ఆమె మనసు చాలా మంచిది. శ్రీవిద్య బాగా సంపాదించుకుంది .. కానీ మోసపోయింది. ఆస్తులన్నీ పోగొట్టుకుంది" అని చెప్పారు.

"శ్రీవిద్యకి తన వాళ్లంటూ ఎవరూ లేరు. అందువలన ఆమె ఎవరినైతే నమ్ముతూ వెళ్లిందో వారే మోసం చేశారు. వాళ్లు ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నారు కనుక, నేను ఇంకా వివరాలు చెప్పలేను. తనకి కేన్సర్ వచ్చింది. ఆ వ్యాధిని గురించి ఆమె ఎవరికీ తెలియనీయలేదు. చివరి రోజుల్లో తెలిసి ఎవరైనా చూడటానికి వచ్చినప్పటికీ, అందుకు ఆమె అంగీకరించేది కాదు" అని చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements