లోకేశ్ పాదయాత్రలో కార్యకర్తల తాకిడికి సొమ్మసిల్లిన తారకరత్న

     Written by : smtv Desk | Fri, Jan 27, 2023, 01:15 PM

లోకేశ్ పాదయాత్రలో  కార్యకర్తల తాకిడికి సొమ్మసిల్లిన తారకరత్న

కొద్దిసేపటి క్రితమే యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. లోకేశ్ ప్రారంభించిన ఈ యాత్రలో సినీ నటుడు నందమూరి తారకరత్నకూడా పాల్గొన్నారు. అయితీ యాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల అనంతరం.. మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి ఎక్కుయింది. ఈ క్రమంలో, పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకకత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.





Untitled Document
Advertisements