శ్రీవారి భక్తుల శుభవార్త చెప్పిన టీటీడీ.. అందుబాటులోకి మొబైల్ యాప్

     Written by : smtv Desk | Fri, Jan 27, 2023, 02:44 PM

శ్రీవారి భక్తుల శుభవార్త చెప్పిన టీటీడీ.. అందుబాటులోకి మొబైల్ యాప్

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే అక్కడ హోటల్స్ మరియు దర్శనాల బూకింగ్స్ కోసం నానా రకాల ఎద్దందులు పడాల్సి వచ్చేది. అయితే భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీనిపేరు 'టీటీ దేవస్థానమ్స్'. దీన్ని జియో ప్లాట్ ఫాంపై అభివృద్ధి చేశారు. టీటీ దేవస్థానమ్స్ యాప్ సాయంతో తిరుమలలో స్వామివారి దర్శనం, గదుల బుకింగ్, ఆర్జిత సేవా టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

ఈ యాప్ లో తిరుమల పుణ్యక్షేత్రం చరిత్ర, శ్రీవారి సేవల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాదు, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యక్రమాలను కూడా ఈ యాప్ లో వీక్షించవచ్చు.

టీటీడీ గతంలో 'గోవింద' అనే యాప్ ను ప్రవేశపెట్టింది. 'గోవింద' యాప్ కు అప్ డేటెడ్ వెర్షనే ఈ 'టీటీ దేవస్థానమ్స్' యాప్. ఇదివరకే 'గోవింద' యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు దాన్ని అప్ డేట్ చేసుకుంటే, 'టీటీ దేవస్థానమ్స్' యాప్ లోకి ఆటోమేటిగ్గా ఎంటరవుతారు. లేకపోతే, నేరుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి 'టీటీ దేవస్థానమ్స్' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ వివరాలు తెలిపింది. ఇకపై ఎటువంటి ఇబ్బందులు పడకుండా నిశ్చింతగా ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements