టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిన్న కుప్పంలో మొదలైన విషయం తెలిసిందే. లోకేశ్ పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్నజరిగిన తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. నేడు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలు పేస్ వైద్య కళాశాల నుంచి పాదయాత్ర మొదలయింది. బెగ్గిలిపల్లె, కడపల్లె, కలమలదొడ్డి గుండా పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం శాంతిపురం క్యాంపు వద్ద సైట్ ఇంటరాక్షన్ ఉంటుంది. లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తున్న పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి.