బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజా చిత్రం పఠాన్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ కు ఈ మూవీ సూపర్ హిట్ గా మారనుందని సినీపండితులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న షారుఖ్ ఫ్యాన్స్ కి మంచి కమ్మటి విందుభోజనంలాంటి చిత్రాన్ని అందించారని చెబుతున్నారు.
ఈ నెల 25న రీలీజ్ అయిన పఠాన్ మూవీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. అంచనాలను మించి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండో రోజే 150 కోట్ల క్లబ్ లో చేరగా.. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయిలను వసూలు చేసింది. భారత దేశంలో మూడో రోజు పఠాన్ వసూళ్లు రూ.34 నుంచి రూ.36 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా చెప్పారు. ఈ మూడు రోజుల్లో దేశం మొత్తం మీద ఈ సినిమా వసూలు చేసిన మొత్తం రూ.157 కోట్లు అని తెలిపారు.