పలమనేరు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర.. నేటి షెడ్యుల్ వివరాలివే !

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 11:14 AM

పలమనేరు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర.. నేటి షెడ్యుల్ వివరాలివే !

నేటితో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఈ రోజు పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో
మొదలై పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం 8 గంటలకు పాదయాత్ర చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి మొదలైంది.
నేటి లోకేశ్ షెడ్యుల్ వివరాలు ఇవే!
* ఉదయం 8 గంటలకు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుండి పాదయాత్ర ప్రారంభం.
* 8:45కి పలమనేరు నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశం.
* 9:30కి వి.కోట మండలం కెంగుటం పంచాయతీ కోరకుంటలో రెడ్డి సామాజికవర్గంతో ముఖాముఖి.
* 10:10కి వి.కోట మండలం పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులతో ముఖాముఖి.
* 10:40కి వి.కోట మండలం గాంధారమాకులపల్లెలో వడ్డెర సామాజికవర్గం ప్రజలతో ముఖాముఖి.
* 12:20కి వి.కోట మండలం జీఎంఆర్ కళ్యాణమండపంలో యువతతో సమావేశం.
* మధ్యాహ్నం 02:05కి వి.కోట మండలం పీఎంఆర్ సత్రం వద్ద భోజన విరామం
04:15కి వి.కోట మండలం ఆఘ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి.
07:20కి వి.కోట మండలం కృష్ణపురం టోల్ గేట్ సమీపంలో రాత్రిపూట బస.





Untitled Document
Advertisements