మీ ఫోన్ లో రెండు సిమ్ కార్డ్స్ ఉన్నాయా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 12:37 PM

మీ ఫోన్ లో రెండు సిమ్ కార్డ్స్ ఉన్నాయా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి

డ్యుయల్ సిమ్ కార్డ్ విధానం అందుబాటులోకి వచ్చిన నాటి నుండి దాదాపు ప్రతి ఒక్కరు రెండేసి సిమ్ కార్డ్స్ ఉపయోగించడానికి అలవాటు పడ్డారు. వారి వ్యక్తిగత అవసరాలకు అంటే కుటుంబం మరియు మిత్రులకు అందుబాటులో ఉండేందుకు ఒక నెంబర్. అదే విధంగా ఆఫీస్ అవసరాలకు ఒక నెంబర్ అనే ధోరణికి అలవాటు పడ్డారు. డానికి తోడు అప్పట్లో టెలీకాం కంపెనీలు కూడా అప్పట్లో జీవితకాల ఇన్కమింగ్ సదుపాయాన్ని ఉచితంగా కల్పించడంతో రెండు సిమ్ కార్డ్స్ వాడడం సులభం అయ్యింది.
కానీ,ఇటీవల టెలికాం కంపెనీలు చార్జీల మోత మోగించడం మొదలు పెట్టడంతో పర్మనెంట్ నెంబర్ ఒక్క దానికి మాత్రమే రీచార్జ్ చేయించుకుంటున్నారు. మరో నెంబర్ కు రీచార్జ్ చేయకుండా వదిలేస్తున్నారు. ఇలా చేయడమంటే సైబర్ నేరస్థులకు అవకాశం ఇచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. కొంతకాలం పాటు వాడిన మొబైల్ నెంబర్ ను ఇలా వదిలేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.

మోసం జరిగేది ఇలా..
రీచార్జ్ చేయకుండా వదిలేసిన నెంబర్ ను టెలికాం కంపెనీలు బ్లాక్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఇలా బ్లాక్ చేసిన నెంబర్లను ఆయా కంపెనీలు అమ్మకానికి పెడతాయి. నిర్ణీత మొత్తం చెల్లించి ఈ నెంబర్ ను ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడే సైబర్ నేరస్థులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఇలాంటి నెంబర్లను సొంతం చేసుకుంటున్నారు. ఆపై ఆయా నెంబర్లకు చెందిన పాత యజమానుల బ్యాంకు లావాదేవీల వివరాలను కూపీ లాగుతున్నారు.
టెక్నాలజీ సాయంతో బ్యాంకు ఖాతా, ఈ మెయిల్ ఐడీని తెలుసుకుని మొబైల్ నెంబర్ తో యూపీఐ యాప్ లలోకి లాగిన్ అవుతున్నారు. ఆపై ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫర్గాట్ యూజర్ ఐడీపై క్లిక్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆపై పాస్ వర్డ్ కూడా మార్చేసి, ఖాతాలోని సొమ్మును కొట్టేస్తారు. ఇదంతా మీ పాత మొబైల్ నెంబర్ వారి చేతుల్లోకి వెళ్లడం వల్లే సాధ్యమవుతుందని నిపుణులు హెచ్చరించారు.





Untitled Document
Advertisements