శ్రీనగర్ లో రాహుల్, ప్రియాంకల సరదా ఆటలు..

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 02:09 PM

భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నేడు శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ లో ఈ రోజు (సోమవారం) భారీగా మంచుకురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నగరంలో ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. ఈ మంచులో రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఆటలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్న పైకి ప్రియాంక మంచు గడ్డలు విసరడం కనిపిస్తోంది.
జోడో యాత్ర ముగింపు సభ కోసం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు సోమవారం జమ్ముకశ్మీర్ కు చేరుకున్నారు. సభకు బయలుదేరి వెళ్లడానికి ముందు పార్టీ ఆఫీసులో ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ఆఫీసు ఆవరణలో పేరుకుపోయిన మంచును చూసి వారు ఇద్దరూ కాసేపు చిన్నపిల్లల్లా మారారు. ఒకరిపై మరొకరు మంచు విసురుకుంటూ ఎంజాయ్ చేశారు. అనంతరం శ్రీనగర్ లోని స్టేడియంలో తలపెట్టిన సభకు నేతలందరూ కలిసి వెళ్లారు.
https://twitter.com/TimesNow/status/1619964760375853056?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1619964760375853056%7Ctwgr%5E73f412067dd1743ea0e23ef271618899d40d612a%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763383%2Frahul-gandhi-and-sister-priyanka-gandhis-snowball-fight-in-srinagar





Untitled Document
Advertisements