రాజకీయ పార్టీని ముందు ఉంది నడిపే వాడు నాయకుడు అయితే అతని వెన్నటి నడిచే వారు కార్యకర్తలు. అయితే, నాయకుడికి గుర్తింపు లభిస్తుంది కానీ అతని వెంట ఉండే కార్యకర్తల కష్టం బూడిదలో పోసిన పన్నీటి చందంలా మిగిలిపోతుంది. అయితే అందుకు బిన్నంగా పార్టీ కొరకు పాటుపడే కార్యకర్తలను కొంతమంది నేతలు గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించడం మనం చూస్తూనే ఉంటాము. తాజాగా పల్నాడు జిల్లాకు చెందిన బాలాజీ అనే జనసైనికుడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వినూత్న కార్యక్రమం చేపట్టిన బాలాజీని పవన్ మెచ్చుకున్నారు.
బాలాజీ తన బైక్ పై ఓ పెట్టె ఏర్పాటు చేసుకుని, పల్నాడు ప్రాంతంలో గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పవన్ కు అందజేసేందుకు 'పల్నాడు ప్రజా సమస్యల పెట్టె' పేరిట సొంతంగా కార్యాచరణ అమలు చేయనున్నారు.
బాలాజీ ఆలోచనను స్వాగతించిన పవన్.. అతడికి ఓ మొబైల్ ఫోన్, ప్రోత్సాహక నగదు అందజేశారు. పవన్ ఆ కార్యకర్తతో ముచ్చటించి, అతడిలో ఉత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఏదేమైనా ఒ పార్టీకి చెందిన కార్యకర్త స్వచ్చందంగా ప్రజల కష్టాల గురించి అడిగి తెలుసుకుని వాటిని తమ నాయకుడి దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయం.
https://twitter.com/JanaSenaParty/status/1619992424499261447?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1619992424499261447%7Ctwgr%5Ee51657e1c825dd9b5969eafd4307ae9f3597a280%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763407%2Fpawan-kalyan-presents-a-mobile-phone-to-party-worker-balaji