ఎన్నికల తరువాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే అంకితం.. కిషన్ రెడ్డి

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 11:56 AM

ఎన్నికల తరువాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే అంకితం.. కిషన్ రెడ్డి

తెలంగాణా ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రాజకీయ వివాదాలు రోజురోజుకి మంచి రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒక కుటుంబం పాలిస్తోందని విమర్శించారు. తెలంగాణలో విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో మూడు, నాలుగు నెలల తర్వాత వారి ఆటలన్నీ ఆగిపోతాయని చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కే అంకితమవుతారని అన్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements