రాబోయే సంవత్సరానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చివరిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాసేపట్లో పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో, కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటులో ఈ సమావేశం జరుగుతోంది. అటు, రాష్ట్రపతితో భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటుకు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్ పై సంక్షిప్తంగా చర్చించి ఆమోదం తెలుపనున్నారు. దేశప్రజలంతా కూడా ఆసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో వేటిలో వెసులుబాటు ఉంటుంది.. వేటిమీద ఆర్ధిక భారం పడనుంది అనే ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.