వార్షిక బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇచ్చిన అంశాలు ఇవే.. నిర్మలమ్మ

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 12:08 PM

వార్షిక బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇచ్చిన అంశాలు ఇవే.. నిర్మలమ్మ

ఈ సంవత్సరపు వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశ పెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మంత్రి ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉన్నప్పటికీ మన దేశంలో వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉందని మంత్రి నిర్మల చెప్పారు. కరోనా కష్టాల నుంచి వేగంగా తేరుకుంటున్నామని, ఈ ఏడాదితో వాటన్నింటినీ గట్టెక్కుతామని తెలిపారు. ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.
తన ప్రసంగంలో ప్రస్తుత బడ్జెట్ ప్రాధాన్యతాంశాలను వివరించారు. 7 అంశాల ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించినట్టు వెల్లడించారు. సమ్మిళిత వృద్ధి, దేశంలో చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు, యువశక్తి, ఆర్థిక రంగ బలోపేతం, గ్రీన్ ఎనర్జీ, రైతులు-మహిళలు-వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా పేర్కొన్నారు.





Untitled Document
Advertisements