కేంద్ర బడ్జెట్ సమావేశాలలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆర్దిక శాఖ మంత్రి?

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 12:15 PM

కేంద్ర  బడ్జెట్ సమావేశాలలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆర్దిక శాఖ మంత్రి?

ప్రతి ఏటా ఆర్ధిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడంతో పాటు అందులో వివారాలను, పత్రిపాదనలను ఆర్థిక మంత్రి సభకు వివరిస్తారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఆనవాయితీ ప్రకారం ఎందఱో ఆర్థిక మంత్రులు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి అందులోని ప్రతిపాదనలను గురించి సభలో ప్రసంగించిన విషయం తెలిసిన సంగతే.. అయితే, ఈ విధంగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘ ప్రసంగం ఎవరు చేశారో తెలుసా..? ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020లో 2020-21 బడ్జెట్ సందర్భంగా రెండు గంటల 42 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ఇదే.

2019లో బడ్జెట్ (2019-20) సందర్భంగా నిర్మలా సీతారామన్ రెండు గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు నమోదు చేశారు. తిరిగి అదే రికార్డ్ ను 2020లో ఆమె బ్రేక్ చేశారు. ఇక 2022లో బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ కేవలం గంటన్నర పాటు మాత్రమే మాట్లాడారు. ఇది ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో స్వల్ప నిడివితో కూడినది. సమయం కాకుండా పదాల పరంగా అతిపెద్ద ప్రసంగాన్ని (18,650 పదాలు) మన్మోహన్ సింగ్ 1991లో చేశారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ 18,604 పదాలతో కూడిన ప్రసంగాన్ని 2018లో చేశారు. 1977లో హిరూభాయ్ ముల్లిజి భాయ్ పటేల్ 800 పదాలతో చేసిన ప్రసంగం అతి చిన్నది.





Untitled Document
Advertisements