ముగిసిన నిర్మలమ్మ ప్రసంగం.. బడ్జెట్ ప్రసంగంలో హైలెట్స్-2

     Written by : smtv Desk | Wed, Feb 01, 2023, 01:30 PM

ముగిసిన నిర్మలమ్మ ప్రసంగం.. బడ్జెట్ ప్రసంగంలో  హైలెట్స్-2

గత కొన్నిరోజులుగా దేశమంతా ఎదురుచూసిన కేంద్ర ఆర్ధిక బడ్జెట్ సమావేశాలలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం వినిపించారు. బడ్జెట్ పలు రంగాలను సృశిస్తూ, కేటాయింపులు, వివిధ స్కీములకు సంబంధించిన వివరాలను చదివి వినిపించారు.

వాటి వివరాలు ఇవే..

మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
రెండేళ్ల కాలవ్యవధితో స్కీమ్
ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం
డిపాజిట్ పై 7.5 శాతం సుస్థిర వడ్డీ
గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం

సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు
ప్రస్తుతం 15 లక్షలుగా ఉన్న పరిమితిని ఇకపై రూ.30 లక్షలకు పెంపు

కర్ణాటకలో వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న ప్రాంతాల సాగు రంగానికి రూ.5,300 కోట్లు
పీఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
దేశీయ ఉత్పత్తుల విక్రయం కోసం యూనిటీ మాల్స్ ఏర్పాటు
దేశంలో 50 నూతన విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల ఏర్పాటు
దేశంలో 50 పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి నిధులు

జాతీయ సహకార డేటా బేస్ కు రూ.2,516 కోట్లు
కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
కృత్రిమంగా ల్యాబొరేటరీల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు
2030 నాటికి 5 ఎంఎంటీ హైడ్రోజన్ తయారీ.. జాతీయ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రూ.19,700 కోట్లు
లడఖ్ లో రెన్యూవల్ ఎనర్జీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.20,700 కోట్లు





Untitled Document
Advertisements