గోపీచంద్ మలినేని చిత్రానికి ఒకే చెప్పిన చిరంజీవి!

     Written by : smtv Desk | Wed, Mar 01, 2023, 12:56 PM

 గోపీచంద్ మలినేని చిత్రానికి ఒకే చెప్పిన చిరంజీవి!

దర్శకుడు గోపీచంద్ మలినేని తన సినిమాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ మేరకు ఆయన మొదటి నుండి కూడా తన సినిమాల్లో మాస్ యాక్షన్ ఉండేలా చూసుకుంటున్నాడు. మాస్ డాన్సులు .. డైలాగులతో పాటు కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఆ జాబితాలో 'డాన్ శీను' .. 'బలుపు' .. 'పండగ చేస్కో' వంటి సినిమాలు కనిపిస్తాయి.

ఇక ఆ మధ్య రవితేజ హీరోగా వచ్చిన 'క్రాక్' .. బాలయ్యతో చేసిన 'వీరసింహా రెడ్డి' చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కథాకథనాల పరంగానే కాకుండా, పాటల పరంగా కూడా 'వీరసింహా రెడ్డి' మంచి మార్కులు కొట్టేసింది. సంక్రాంతి బరిలో మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన చిరంజీవికి ఒక కథను వినిపించాడనీ .. ఆ కథ మెగాస్టార్ కి బాగా నచ్చేసిందని అంటున్నారు. ఇద్దరు ముగ్గురు దర్శకులు చిరంజీవికి కథలు వినిపించినప్పటికీ, ఆయన గోపీచంద్ మలినేని సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నారని చెబుతున్నారు.





Untitled Document
Advertisements