ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై రానున్న బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత తీసుకురావాలి.. సూర్యనారాయణ డిమాండ్

     Written by : smtv Desk | Wed, Mar 01, 2023, 04:01 PM

ప్రభుత్వ  ఉద్యోగుల జీతాలపై రానున్న బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత తీసుకురావాలి.. సూర్యనారాయణ డిమాండ్

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతల చెల్లింపు విషయంలో ప్రతి నేలా అలసత్వం ప్రదర్శిస్తూ జీతాలను సకాలంలో చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని.. ఈ విషయంలో ఆందోళనకు వెళ్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు జీతాలనేవి ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేవి కాదని.. జీతాలు ఉద్యోగుల హక్కు అని అన్నారు.

జీతాల విషయంలో రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను చెల్లించేలా చట్టం చేయాలని అన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ కూడా కేవలం పేపర్ల పైనే ఉంటోందని.. ఖాతాల్లో ఉండటం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఏప్రిల్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.





Untitled Document
Advertisements