ఏపీలో ఈ నెల 14 వ తేదిన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. ఏపీ బడ్జెట్ నేపధ్యంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్ లోని ఒకటో బ్లాక్ లో 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.