చిత్తుగా ఓడిన రోహిత్ సేన.. మూడో టెస్ట్

     Written by : smtv Desk | Fri, Mar 03, 2023, 11:52 AM

చిత్తుగా ఓడిన రోహిత్ సేన.. మూడో టెస్ట్

రోహిత్ సేన రెండు టెస్టు మ్యాచ్ ల్లోనూ వరుసగా గెలిచి దూసుకెలుతున్న సమయంలో ఆస్ట్రేలియా భారత జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. మూడో టెస్టు కూడా గెలిచి సిరీస్ తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధించాలని ఆశించిన భారత జట్టుకు ఇండోర్ లో చుక్కెదురైంది. స్పిన్ అస్త్రంతో మొదటి రెండు టెస్టుల్లో ఆసీస్ ను చుట్టేసిన భారత్ ఇప్పుడు అదే స్పిన్ వలలో చిక్కుకొని 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని మూడో రోజు, శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.

ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) వన్డే స్టయిల్లో బ్యాటింగ్ చేసి భారత ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. రెండో వికెట్ కు అజేయంగా 77 పరుగులు జోడించి ఆసీస్ ను గెలిపించారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 109 పరుగులకు ఆలౌట్ అవగా.. అంతకుముందు ఆస్ట్రేలియా 197 స్కోరు చేసి 88 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 163 పరుగులకే కుప్పకూలి ప్రత్యర్థికి చిన్న లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది.

ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఆధిక్యాన్ని ఆసీస్ 2-1కి తగ్గించింది. దాంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 9 నుంచి జరుగుతుంది.





Untitled Document
Advertisements