ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి నోటీసులు

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 03:54 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఎవరి నోట విన్న ఇదే మాట. ఇప్పటికే ఈ కేసు విచారణలో అనేక మందిని విచారించడం జరిగింది. అదే విధంగా కొంతమందిని ఈ కేసులో అరెస్ట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

ఇదే కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్టయ్యారు. ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ‘సౌత్ గ్రూప్’లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులు రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. చూడాలి ఇంకా ఎంత మంది పేర్లు ఈ కేసులో వెలుగు చూస్తాయి అనేది.





Untitled Document
Advertisements