అవినాశ్ రెడ్డి పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.. వివేకాహత్య కేసు

     Written by : smtv Desk | Fri, Mar 17, 2023, 12:05 PM

అవినాశ్ రెడ్డి పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.. వివేకాహత్య కేసు

ఏళ్ళు గడిచినా వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కానీ కొన్ని నెలలుగా ఈ కేసు విషయంలో సిబిఐ అధికారులు తమ దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులను అనేక దఫాలు గా విచారించారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది.

సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని, విచారణపై స్టే విధించాలని కోరుతూ అవినాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే.. విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించింది. కానీ..విచారణ సమయంలో న్యాయవాది అస్సలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఆడియో, వీడియో రికార్డు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.





Untitled Document
Advertisements