బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మద్యం కుంబకోణం కేసులో ఈడీ అధికారులు విచారిస్తున్న నేపధ్యంలో ఆమె పేరు ప్రస్తుతం రాష్ట్రమంతటా మారుమోగిపోతుంది. ఈ నేపధ్యంలో ఆమె సుప్రీం కోర్టులో ముందస్తు విచారణ కొరకు ఈ రోజు పిటిషన్ దాఖలు చేస్తే అది తిరస్కరణకు గురైంది అంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే కవిత సుప్రీంకోర్టులో తనకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ‘‘గౌరవ సుప్రీంకోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు’’ అని ట్వీట్ చేశారు. ఓ న్యూస్ వెబ్ సైట్ లో వచ్చిన వార్త లింక్ ను కూడా జత చేశారు.
ఈనెల 11న ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. గురువారం జరగాల్సిన రెండో విడత విచారణకు ఆమె వెళ్లలేదు. ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. ఈనెల 24న విచారణ జరుపుతామని ధర్మాసనం చెప్పింది. కోర్టు తీర్పు తర్వాతే విచారణకు హాజరువుతానని కవిత లేఖ రాయగా.. ఈడీ అధికారులు తిరస్కరించారు.
ఈ నెల 20న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ మరోసారి కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
గౌరవ సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది. నేను ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. https://t.co/q8x3wkRKzV
mdash; Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2023