చైనీయుల దృష్టిలో భారత ప్రధాని ఓ అసాధారణ నేత

     Written by : smtv Desk | Mon, Mar 20, 2023, 12:00 PM

చైనీయుల దృష్టిలో భారత ప్రధాని ఓ అసాధారణ నేత

డ్రాగన్ దేశమైన చైనా మరియు భారత్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఎటువంటి వాతావరణంలో సైతం భారత ప్రధాని మోదీ చైనీయుల దృష్టిలో ఓ అసాధారణ నేతగా నిలిచారు. చైనాలో మోదీకి మంచి పాపులారిటీ ఉందంటూ అమెరికా పత్రిక డిప్లొమాట్ తాజాగా ఓ కాలమ్‌ను ప్రచురించింది. మోదీ నాయకత్వంలో భారత్.. అగ్రదేశాలతో దౌత్యసంబంధాల విషయంలో సమతూకం పాటిస్తోందంటూ చైనా జర్నలిస్టు ము షుంసాన్ అందులో పేర్కొన్నారు. చైనా నెటిజన్లు భారత ప్రధానిని ‘మోదీ లాక్షియన్’ అని పిలుచుకుంటున్నారు. అసాధారణ ప్రజ్ఞ ఉన్న వృద్ధుడైన దివ్య పురుషుడని దీని అర్థం.

మోదీ వస్త్రధారణ, రూపం విభిన్నంగా ఉంటాయని, ఆయన విధానాలు గత నేతలకన్నా భిన్నాంగా ఉంటాయని ము షుంషాన్ విశ్లేషించారు. రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో స్నేహంగా ఉంటూ మోదీ వాటి మధ్య సమతూకం పాటిస్తారని వ్యాఖ్యానించారు. చైనా ప్రజల దృష్టిలో మోదీకి ఓ అసాధారణ స్థానముందని కూడా పేర్కొన్నారు. చైనా ప్రజలు ఓ విదేశీ నేతకు ముద్దుపేరు పెట్టడం ఎప్పుడూ చూడలేదని కూడా పేర్కొన్నారు. చైనా సోషల్ మీడియా వేదికైన ‘సైనా వీబో’లో మోదీ 2015లో చేరినట్టు చెప్పారు. ఆయనకు 2.44 లక్షల ఫాలోవర్లు ఉండేవారని, అయితే.. 2020లో చైనా యాప్‌లపై భారత్ విధించిన నిషేధం కారణంగా మోదీ తన అకౌంట్‌ను మూసేశారని చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements