ఈ మహిళా టీసీ ఎవరినీ విడిచి పెట్టదు.. ముక్కు పిండి మరీ రూ.కోటి ఫైన్ వసూలు

     Written by : smtv Desk | Fri, Mar 24, 2023, 11:39 AM

ఈ మహిళా టీసీ ఎవరినీ విడిచి పెట్టదు.. ముక్కు పిండి మరీ రూ.కోటి ఫైన్ వసూలు

చేస్తున్న వృత్తి పట్ల అంకిత భావంతో ఎంత మంది పనిచేస్తున్నారు అంటే కచ్చితంగా చెప్పడం కష్టం. ప్రైవేట్ రంగాలలో కొనసాగే వారికి పని చేయకుంటే పనిలో నుండి తెసేస్తారు అనే భయంతో తప్పక పనిచేస్తారు. కానీ ప్రభుత్వ రంగంలో వారు పూర్తి స్థాయి శ్రద్ధ చుపకున్నా కూడా వారి ఉద్యోగానికి వచ్చే ప్రమాదం ఏమి ఉండదు కనుక వారు అడపాదడప ఎదో మొక్కుబడిగా పనులు చేయడం చూస్తూనే ఉంటాము. అయితే అందరు అలానే ఉంటారు అనుకుంటే అది తప్పే అవుతుంది అని ఒ మహిళ ఉద్యోగి నిరూపించారు. ఆమె పేరు రోసలిన్ అరోకియా మేరీ. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. తన విధుల్లో ఆమె ఎంతో కచ్చితంగా, ఖండితంగా ఉంటారు. టికెట్ లేకుండా పట్టుబడితే జరిమానా చెల్లిస్తే తప్ప విముక్తి కల్పించరు. ఇలా టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని వారి నుంచి ఆమె రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, నిజాయతీగా పనిచేస్తున్న ఈ మహిళా టికెట్ ఇన్ స్పెక్టర్ కు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, సామాన్యులు సైతం మేరీని అభినందిస్తున్నారు.

దీనిపై రేల్వే శాఖ ట్వీట్ చేసింది. ‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని అందులో పేర్కొంది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి ట్విట్టర్ లో యూజర్లు పెద్ద సంఖ్యలో అభినందనలు చెబుతున్నారు.







Untitled Document
Advertisements