అధికార వైసీపి ఎమ్మెల్యే శ్రీదేవి జగన్ ప్రభుత్వ తీరుపై సంచలన వాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ లేదు. ఎసీల పై దాడులకు పాల్పడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. నేను హైదరాబాద్ లో టాప్ 10 డాక్టర్లలో ఒకదాన్ని అటువంటి నన్ను ప్రతి దానికి ఇది నువ్వే చేసావు నువ్వే చేసావు అంటూ పదే పదే నన్ను సభ నుండి సస్పెండ్ చేసేవారు. అయినా నేను అవేవి పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేసాను. కానీ అమరావతి రైతుల ధర్నా చూసిన సమయం నుండి తనలో అంతర్మధనం మొదలైంది అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిలో 10 శాతం కూడా జరగలేదు. అమరావతి జగనన్న ఇల్లు పక్కా స్కామ్ అంటూ సంచలన వాఖ్యలు చేసారు. "ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అనారోగ్యంతో భాదపడుతూ క్యాంపెన్ కు రాలేను అన్నా కూడా నన్ను ఎంతగానో వేధించారు. నన్ను పిచ్చి కుక్కతో సమానంగా చూశారు. తనని రోడ్డు మీదకు తరిమేశారు". అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.