తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 11:27 AM

తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అవినాశ్ ను ఈ రోజు వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి గత శనివారం వాదనల సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కు సంబంధించి కొన్ని షరతులు విధించింది. ఇప్పుడు బెయిల్ మంజూరు చేయంతో అవినాశ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. హైకోర్టు విధించిన షరతులు ఏమిటనేది కాసేపట్లో తెలియనుంది. మరోవైపు, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.





Untitled Document
Advertisements