ఉదంకుడు ఇతడు భృగు వంశానికి చెందినవాడు. గౌతముని శిష్యుడు. గౌతముడు మిగతా శిష్యులకు ఎన్నో రకాల వరములిచ్చి ఇతడిని ఏ మాత్రం కనికరించలేదు. అయిననూ అట్లే గురువును కొలుచుచుండెను ఒకరోజు ఉదంకుడు కట్టెల మోపు తెచ్చుచుండగా అతని జడ కట్టెల మోపులో దిగబడి రాకుండెను అట్లే గురువు వద్దకు వచ్చి ఏడ్చుచూ కూర్చుండెను. అతని కళ్ళవెంట కన్నీటి ధారలు కారగా తన కూతురితో ఆ కన్నీటి ధారలు క్రిందపడకుండా దోసిలి పట్ట మన్నాడు. శిష్యుడు గౌతమునితో తన కష్టాలకు ఉపాయము లేదా, ఇతరులపై గల దయ నాపై లేదా అని అడుగగా నిన్ను ఎట్లు వదలగలను, నా కుమార్తెనిచ్చి నీకు వివాహము చేసెదనని చెప్పాడు. ఆ సంతోషములో ఉదంకుడు గౌతముని భార్య అహల్యతో నీకేమి కావలయు నన్న తెచ్చి యిత్తును, కోరు కొమ్మనెను. మిత్ర సహుడగు రాజు భార్య మదయంతి వద్దగల కుండలములు తెచ్చి యిమ్మనెను మిత్రసహుని భవనమున కేగి తన గురుపత్ని కోరికను వెల్ల డించగా ఆ కుండలములిచ్చి అత్యంత జాగ్రత్తగా వెళ్ళమనిరి. వీటిని అశుభ్రముగా తాకినను లేక ఎక్కడైన భూమిపై పెట్టినను సురలు, గంధర్వులు, ఉరగములు అపహరిస్తారు జాగ్రత్త అని చెప్పాడు. మార్గ మధ్య మున ఆకలిగా ఉండి ఆ కుండలములను చెట్టుకు కట్టి ఆకలి దీర్చుకొనుటకు చెట్టు ఎక్కగా గాలికి కుండలములు క్రింద పడగా వెంటనే సర్పమొకటి వచ్చి ఆ కుండలములను నాగ లోకమునకు తీసుకొనిపోయింది. ఉదంకుడు కర్రతో భూమిని తవ్వు చుండగా ఇంద్రుడు వచ్చి కర్రతో తవ్వగా ఎంత కాలము నకు నాగలోకమునకు వెళ్లగలవు అని అడుగగా ఏది ఏమై నను బ్రహ్మత్వమునైనను వదులుకొందునుగాని త్రవ్వుట ఆపను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు కర్రను శూలముగా చేయగా, భూమి అతనికి దారియిచ్చింది. ఉదంకుడు నాగ లోక మును పోగా, అచట ఒక అశ్వము కన్పించి నా యపాన మెత్తి యూదుము నీ కార్యము సిద్ధించుననెను. అంతేగాక తను గౌతముని గురువగు అగ్నినగుట తెలియజేసెను. అట్లు ఊదగా అశ్వము యొక్క వెంట్రుకలన్నియు అగ్ని కణములై పొగ జిమ్మగా నాగులు భయపడి కుండలములు తెచ్చి యివ్వగా, ఉదం కుడు వాటిని తెచ్చి గురుపత్నియగు అహల్యకు సమర్పించాడు.