పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్​ప్రెస్​.. ఆ మార్గంలో రద్దయిన పలు రైళ్ళు

     Written by : smtv Desk | Wed, Feb 15, 2023, 01:31 PM

పట్టాలు తప్పిన  గోదావరి ఎక్స్​ప్రెస్​.. ఆ మార్గంలో రద్దయిన పలు రైళ్ళు

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంగతి విదితమే. ఘట్ కేసర్ వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించే 7 రైళ్లను బుధవారం రద్దు చేసినట్టు, మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రద్దయిన రైళ్లు ఇవే
కాచిగూడ–నడికుడి
నడికుడి–కాచిగూడ
సికింద్రాబాద్–వరంగల్
వరంగల్–హైదరాబాద్
గుంటూర్–సికింద్రాబాద్
సికింద్రాబాద్–రేపల్లె





Untitled Document
Advertisements