మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంగతి విదితమే. ఘట్ కేసర్ వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. బోగీలు నిలిచిపోయిన కారణంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించే 7 రైళ్లను బుధవారం రద్దు చేసినట్టు, మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రద్దయిన రైళ్లు ఇవే
కాచిగూడ–నడికుడి
నడికుడి–కాచిగూడ
సికింద్రాబాద్–వరంగల్
వరంగల్–హైదరాబాద్
గుంటూర్–సికింద్రాబాద్
సికింద్రాబాద్–రేపల్లె
Cancellation/Partial Cancellation of Trains pic.twitter.com/JqBAKXvLBn
mdash; South Central Railway (@SCRailwayIndia) February 15, 2023