మరో సారి ట్విట్టర్‌ మాజీ సీఈఓ పై తన అక్కసు వెళ్ళగక్కిన మస్క్.. ఏకంగా కుక్కని సీట్లో

     Written by : smtv Desk | Wed, Feb 15, 2023, 12:12 PM

మరో సారి ట్విట్టర్‌  మాజీ సీఈఓ పై తన అక్కసు వెళ్ళగక్కిన మస్క్.. ఏకంగా కుక్కని సీట్లో

ట్విట్టర్‌ కొనుగోలు ప్రస్తావన వచ్చిన నాటి నుండి ఎలాన్ మస్క్ ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మొదట ట్విట్టర్‌ కొనుగోలు వ్యవహారంలో కోర్టు కేసుల వరకు వెళ్లి వార్తల్లో నిలిచి ఎట్టకేలకు కొనుగోలు చేసారు. ట్విట్టర్‌ కొనుగోలు తరువాత ముతబడిన ఖాతాలను పునరుద్దరించడం, ఉద్యోగులను తొలగించడం, ఉద్యుగులకు కటినమైన ఆంక్షలు విధించడం మొదలుకొని పెయిడ్ సర్వీస్లు అందుబాటులోకి తేవడం వరకు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. తాజాగా ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్‌ సీఈఓ కుర్చీలో కూర్చొబెట్టారు. దీనికి సీఈఓ అని రాసి ఉన్న టీ షర్ట్ను తొడిగారు. ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఇదివరకు సీఈఓగా పని చేసిన భారతీయుడు పరాగ్ అగర్వాల్ కంటే తన కుక్క ఫ్లోకినే మెరుగ్గా పని చేస్తుందన్నారు. తద్వారా పరాగ్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు.
న్యాయపోరాటం తర్వాత ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న మస్క్ అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. ఈ డీల్ పూర్తయిన వెంటనే అగర్వాల్‌ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ ను తొలగించారు. వారిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ తన చేతిలోకి రాగానే అనేక మార్పులు చేశారు.





Untitled Document
Advertisements