హైదరాబాద్, జూలై 15 : యువ కథానాయకుడు నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు 'భీష్మ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. విభిన్నమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. నితిన్ ఇప్పటికే 'శ్రీనివాస కళ్యాణం' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నితిన్ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్నా ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాతే నితిన్ 'భీష్మ' చిత్రంలో పాల్గొననున్నారు.