జనసేన అధినేత కు షాక్ ఇచ్చిన గ్రామ పెద్దలు

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 03:04 PM

జనసేన అధినేత కు షాక్ ఇచ్చిన గ్రామ పెద్దలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామ పెద్దలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకు రౌడీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, పవన్ పై చింతమనేని కూడా అదే స్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో, గుడివాకలంక గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.





Untitled Document
Advertisements