ప్రధాని నరేంద్రమోడీ సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువచ్చిందని, ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. ఈ అంశంపై మజ్లీస్ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ చాలా ఘాటుగా స్పందించారు.
“ముస్లిం మహిళల హక్కులను కాపాడుతానని చెపుతున్న మోడీజీ, మీ భార్య హక్కులను కాపాడారా? ఆమె కోసం మీరేమైనా చేశారా? ఆమె హక్కులు కాపాడలేని మీరు ముస్లిం మహిళ హక్కులను ఏవిధంగా కాపాడగలరు?” అని ప్రశ్నించారు.