వనపర్తి : వనపర్తి జిల్లాలోని జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డా. లలిత కృష్ణ కుమారి అన్నారు. గురువారం టియుడబ్లుజె (ఐజెయు) వనపర్తి పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు లట్టుపల్లి రవికాంత్, భాస్కర్ యాదవ్ల ఆధ్వర్యంలో డా.లలిత కృష్ణకుమారికి జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవల వినతి పత్రాని అందజేశారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ… జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన డా. లలిత కృష్ణకుమారికి కృతజ్ఞతలు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో పట్టణ ఉపాధ్యక్షులు వేనుగోపాల్, ప్రచార కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి మన్యం, కార్యదర్శులు సురేష్, రమేష్, సిరాజ్, ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు దినేష్, తదితరులు ఉన్నారు.